దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు అడపా దడపా పెరుగుతున్న సంగతి తెలిసిందే.చాలా వరకు సెలబ్రెటీలు మరియు రాజకీయ నాయకులు కరోనా బారిన పడుతున్నారు.
ఈ దిశగానే మంత్రి కేటీఆర్ ఇటీవల కరోనా బారిన పడటం జరిగింది.ఈ క్రమంలో సోమవారం వైద్య పరీక్షలు చేయించగా నెగిటివ్ రిపోర్టు రావడం జరిగింది.
కరోనా నుండి కేటీఆర్ పూర్తిగా కోరుకున్నట్లు డాక్టర్ లు ధ్రువీకరణ పత్రం విడుదల చేశారు.
ఈ విషయాన్ని టిఆర్ఎస్ పార్టీ అధికారికంగా ప్రకటన విడుదల చేయటం జరిగింది.
రేపటినుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.దీంతో నిన్న మొన్నటి వరకు కేటీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా లేదా అనేది పార్టీ నాయకులలో కింది కేడర్ లలో సందిగ్తత నెలకొంది.
అయితే ఇప్పుడు కేటీఆర్ కరోనా నుండి పూర్తిగా కోలుకోవటం మాత్రమే కాదు రేపటినుండి జరగబోయే అసెంబ్లీ సమావేశాలలో కూడా జాయిన్ కానున్నట్లు పార్టీ ప్రకటన చేయటం.సంచలనంగా మారింది.