టీడీపీ వ్యాఖ్యలకు ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కౌంటర్ ఇచ్చారు.చంద్రబాబు మతిభ్రమించి మాట్లాడుతున్నారన్నారు.
తాను అప్పుల మంత్రినైతే.యనమల పెద్ద అప్పుల మంత్రి అని ఎద్దేవా చేశారు.
ఆర్థిక మంత్రే అప్పులు చేస్తారన్న ఆయన హోంమంత్రి చేయరని తెలిపారు.గత ప్రభుత్వం కంటే తమ అప్పులు తక్కువేనని పేర్కొన్నారు.
సొంత వ్యాపారాల కోసం విజయ డెయిరీని నాశనం చేశారని ఆరోపించారు.చంద్రబాబు తప్పుడు నిర్ణయాల కారణంగానే పోలవరం ఆలస్యం అయిందని విమర్శించారు.
పోలవరం అంచనాలపై కేంద్రంతో చర్చించి అవగాహనకు వచ్చినట్లు వెల్లడించారు.అదేవిధంగా శ్రీబాగ్ ఒప్పందం ప్రకారమే కర్నూలులో హైకోర్టని స్పష్టం చేశారు.