మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం ప్రతిరోజూ పండగే ఇటీవల రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది.ఈ సినిమాతో తేజు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న సక్సె్ను అందుకున్నాడు.
కాగా ఈ సినిమాతో దర్శకుడు మారుతి తన ప్రతిభను మరోసారి నిరూపించుకున్నాడు.అయితే ఇప్పుడు ఇదే ఆయనకు చేటుగా మారినట్లు తెలుస్తోంది.
తెలుగులో ప్రస్తుతం తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రం కోసం యావత్ తెలుగు ప్రజలు ఎంతో ఆసక్తిగా చూస్తు్న్నారు.ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమని ప్రేక్షకులతో పాటు సినీ జనాలు కూడా అంటున్నారు.
అయితే ఈ సినిమా నిర్మాత డివివి దానయ్య దర్శకుడు మారుతితో ఓ సినిమా చేయాలని కోరాడట.అయితే ప్రతిరోజూ పండగే సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్బస్టర్ కావడంతో మారుతి తన రెమ్యునరేషన్ అమాంతం పెంచేశాడట.
దీంతో దానయ్య ఆఫర్ను ఆయన రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.మరి ఆర్ఆర్ఆర్ లాంటి ప్రెస్టీజియస్ సినిమాను రూపొందిస్తున్న నిర్మాతతో సినిమా చేసే ఛాన్సును మారుతి మిస్ చేసుకోవడం ఎంతవరకు ఆయనకు కలిసొస్తుందో చూడాలి.