కార్తీక మాసం చివరి సోమవారం ఈ పని చేస్తే అంతా శుభమే!

హిందూ క్యాలెండర్ ప్రకారం ఎంతో పవిత్రమైన కార్తీక మాసం భక్తులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ నెల మొత్తం పూజా కార్యక్రమాలలో పాల్గొంటారు.ఈ విధంగా కార్తీక మాసంలో నెల రోజులు దీపాలను పెడుతూ పెద్ద ఎత్తున పూజలు చేస్తుంటారు.

 If You Do This On The Last Monday Of Karthika Month All Is Well , Karthika Masam-TeluguStop.com

కార్తీకమాసం శివకేశవులకు ఎంతో పవిత్రమైన మాసం అని చెప్పవచ్చు.ఈ క్రమంలోనే నేడు కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు శివ ఆలయాలను సందర్శించి స్వామి వారిని దర్శనం చేసుకొని ఆయన అనుగ్రహాన్ని పొందుతారు.

ఇక నేడు చివరి సోమవారం కనుక భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుడిని బిల్వదళాలతో పూజించాలి. చివరి కార్తీక సోమవారం కావడంతో భక్తులు ఉపవాసంతో స్వామి వారిని పూజించి దీపారాధన చేయటం వల్ల ఆ పరమేశ్వరుడు అనుగ్రహం కలిగి శుభ ఫలితాలు కలుగుతాయి.

ఇక నేడు ఉదయం సాయంత్రం నది స్నానాలను ఆచరించి పూజ చేయాలి.మనసు మొత్తం ఆ పరమేశ్వరుడు పై నుంచి మూడుసార్లు నదీ స్నానం చేసిన అనంతరం స్వామివారికి పూజ చేయాలి.

అదేవిధంగా నేడు ఉపవాసంతో స్వామి వారిని పూజించిన తర్వాత చాలా మంది భక్తులు కార్తీక వన భోజనాలు చేస్తారు.ఇక కార్తీక భోజనాలలో భాగంగా ఉసిరి చెట్టుకు పూజలు చేసిన అనంతరం ఆ చెట్టు కిందే భోజనం చేస్తారు.

అలాగే నేడు పెద్దఎత్తున పూజా కార్యక్రమాలలో పాల్గొనడమే కాకుండా దానధర్మాలను కూడా చేయాలని పండితులు సూచిస్తున్నారు.మన ఆర్థిక స్తోమతను బట్టి దానధర్మాలు చేయడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube