మన దేశవ్యాప్తంగా ఎన్నో పురాతన ఆలయాలలో ప్రతిరోజు భక్తులు వెళ్లి పూజలు చేసి దేవుళ్లను దర్శించుకుని వస్తూ ఉంటారు.అలాగే భద్రాచలం శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి దేవాలయంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మా స్వామి అంటే నువ్వేలే రామయ్య అంటూ భక్తులు దేవాలయం చుట్టూ ప్రదక్షిణాలు చేశారు.ప్రధాన కోవెలలో సుప్రభాతం పలికి ఆరాధించిన అర్చకులు దేవదేవుడి నామాలతో అర్చనలు చేశారు.
భద్రాద్రి రామయ్య దర్శనం సర్వ శుభకరమని వైదిక పెద్దలు చేసిన ప్రవచనాలకు భక్తులను పులకింపచేసాయి.
కన్యాదానం చేసి సీతాదేవికి చేయవలసిన అన్ని కార్యక్రమాలను చేశారు.
మాంగళ్యధారణ అక్కడి భక్తులందరికీ కనిపించింది.తలంబ్రాల వేడుక తన్మయత్వాన్ని చాటింది.
దర్బారు సేవ ఆధ్యాత్మిక భావనలను మరింత పెంచడంలో కీర్తనలు ఓలాలాడించాయి.సీతారాముల వారి అందాల జెండా అందరి కళ్ళకు ఎంతో కనువిందు చేయడంలో నిత్య కళ్యాణ కార్యక్రమం అంతులేని ఆనందాన్ని కలిగించింది.11న శ్రీ రామ దీక్షల విరమణ చేసిన తర్వాత వెండి రధసేవ చేస్తారు. 12న పుష్యమికి పట్టాభిషేకం నిర్వహించే అవకాశం ఉంది.16 నుంచి ధనుర్మాసోత్సవాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.ఇంకా చెప్పాలంటే దమ్ముగూడెం పర్ణశాలలో ముక్కోటి ఏర్పాట్లను భద్రాచలం దేవస్థానం ఈవో శివాజీ పరిశీలించే అవకాశం ఉంది.
దేవాలయంలో ఏర్పాటు చేస్తున్న చలవ పందిళ్లను గోడలకు రంగులు వేసే పనులను ముఖ్యంగా పరిశీలిస్తారు.ఈ నెల 23వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ముక్కోటి ఏకాదశి అధ్యాయానోస్తవాలను ఘనంగా నిర్వహించాలని చెబుతున్నారు.

పంచ వంటి కుటీరం పరిసరాలను శుభ్రం చేయాలని ఆదేశించారు.రామాయణాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించాలని కూడా చెప్పారు.2023 జనవరి 1వ తేదీన పర్ణశాల పవిత్ర గోదావరి నదిలో జరిగే శ్రీ స్వామి వారి తిప్పోత్సవం 2 వ తేదీన జరిగే వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఈవో సిబ్బందిని ఆదేశించారు.ఈ.రవీంద్ర ఆలయ సూపరిండెంట్ నిరంజన్ కుమార్ ఇంకా మిగతా ఆలయ అభ్యర్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.