సమాచార హక్కు చట్టం బోర్డు ఏర్పాటు చేయండి:ఎండి మజాహర్

సూర్యాపేట జిల్లా( Suryapet District ):కోదాడ పోస్ట్ ఆఫీస్ లో తప్పనిసరిగా సమాచార హక్కు చట్టం బోర్డు ఏర్పాటు చేయాలని కోదాడ నియోజకవర్గ సమాచార హక్కు చట్టం ఉద్యమకారుడు,స్ఫూర్తి వినియోగదారుల సంఘం అధ్యక్షుడు ఎండి.

మజాహర్( MD Mazahar ) పోస్టల్ అధికారులను కోరారు.

శుక్రవారం కోదాడ పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ లో హెడ్ పోస్ట్ మాస్టర్ రవికి వినతిపత్రం అందజేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం బోర్డు లేనందున వినియోగదారులకు పోస్ట్ ఆఫీస్ ( Post Office )ద్వారా అందించే సేవలు,ప్రభుత్వ పథకాలు, ఇతర సమాచారం తెలుసుకునేందుకు ఇబ్బందికరంగా ఉందని, తక్షణమే సంబంధిత అధికారుల వివరాలతో కూడిన బోర్డును వీలైనంత తొందరగా ఏర్పాటు చేయాలన్నారు.

సినిమా ఇండస్ట్రీ లో అసలేం జరుగుతుంది...ఎలాంటి కథలు సక్సెస్ అవుతున్నాయి...

Latest Suryapet News