యాదాద్రి భువనగిరి జిల్లా( Yadadri Bhuvanagiri District ): గుండాల మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం తెలంగాణ జాతిపిత డాక్టర్జయశంకర్సార్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర హాజ్ కమిటీ సభ్యులు ఎండి షర్ఫుద్దీన్ ( MD Sharfuddin )మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ సార్( Professor Jayashankar Sir ) తెలంగాణ సాధనే జీవితంగా భావించి, ఒక్కొక్కరిని పోగేసి,కోట్ల మందిని కూడదీసి,కలాలను, గళాలను ఏకం చేసి,గల్లీ నుండి ఢిల్లీ దాకా ఉద్యమాన్ని వ్యాప్తి చేసి,రక్తపుచుక్క చిందకుండా, ప్రజాస్వామ్య పోరాటానికి వ్యూహా రచన చేసి,తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముఖ్య భూమిక పోషించిన దార్శనికుడని కొనియాడారు.
ఆయనను స్మరించుకోవడం అంటే ఆయన సేవలు నేటి తరానికి గుర్తు చేయడమేనన్నారు.
ఈ కార్యక్రమంలో టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అన్నెపర్తి యాదగిరి,పొడిచేటి వెంకన్న, ఇమ్మడి దశరథ,ఐలయ్య, నాగమల్లు,మొగులయ్య,ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.