హిందూ ధర్మంలో నుదుటిపై బొట్టు పెట్టుకోవడానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.తిలకం పెట్టుకోవడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని శాస్త్రాలలో చెప్పబడింది.
నుదుటిపై బొట్టు పెట్టుకోవడం వల్ల మెదడుకు చల్లదనం లభిస్తుంది.ఏకాగ్రతకు సహాయపడుతుంది.
తిలక దారణ వల్ల మనిషిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.దీంతో నిర్ణయాలను దృఢంగా తీసుకోగలుగుతాడు.
బొట్టు పెట్టుకోవడం వల్ల మెదడులోని సెరోటోనిన్ మరియు బీటా ఎండార్ఫిన్ స్రావాలు సమతుల్యమవుతాయి.ఇది దుఃఖాన్ని తొలగించి, ఆనందాన్ని కలిగిస్తుంది.
బొట్టు పెట్టుకోవడం వల్ల గ్రహాల స్థితి గతులు మెరుగుపడతాయి.నుదుటిపై తిలకం పెట్టుకున్న వ్యక్తికి తలనొప్పి రాదని చెబుతారు.
నుదుటిపై తిలకం పెట్టుకోవడం వల్ల మనసులో ప్రతికూల భావాలు రావు.పసుపు తిలకం నుదుటిపై పెట్టుకోవడం వల్ల శరీరం కాంతి వంతంగా మారుతుంది.
పసుపు యాంటీ బాక్టీరియల్గా పనిచేస్తుంది.ప్రతీదినం నుదుటిపై తిలకం పెట్టుకునే వారి ఇంట్లో ఆహార పానీయాలకు లోటు ఉండదని శాస్త్రాలు చెబుతున్నాయి.
గ్రహా దోషాలు తొలగిపోయి, అదృష్టం కలుగుతుందని చెబుతారు.ఎక్కువగా ఉంగరపు వేలితో తిలకం దిద్దుతారు.ఇలా చేయడం వల్ల గౌరవం, ప్రతిష్ట పెరుగుతుంది. బొటనవేలుతో కూడా తిలకం దిద్దుతారు.ఇలా చేయడం వల్ల జ్ఞానం లభిస్తుంది.అదే సమయంలో ఏదైనా పనిలో విజయం సాధించడానికి చూపుడు వేలితో తిలకం దిద్దుతారు.