తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.ఇవాళ ఉదయం విఐపీ విరామ సమయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి ఎల్.
మురుగన్, ఏపీ సీఎస్ సమీర్ శర్మా, తెలంగాణ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, పండిట్ రవి శంకర్ గురుజీ వేరువేరుగా స్వామి సేవలో పాల్గొన్నారు.
వీరికి ఆలయ ఉన్నతాధికారులు అధికారులు దగ్గరవుండి దర్శన ఏర్పాట్లను చేశారు.
దర్శనాంతరం రంగనాయక మండపంలో వేదపండితుల ఆశీర్వచనం పలకగా, అధికారులు స్వామివారి తీర్ధప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు.