లతా మంగేష్కర్ పాదాల వద్ద షారుక్ నిజంగానే ఉమ్మేసాడా.. అసలు మ్యాటర్ ఏంటంటే..

భారత దేశ ప్రముఖ గాయని లతా మంగేష్కర్ గురించి తెలియని వారు ఉండరు.భారతరత్న లతా మంగేష్కర్ కరోనా తో పాటు మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ తో మరణించిన విషయం తెలిసిందే.

 Did Shah Rukh Khan Really Spit On Lata Mangeshkar Mortal Remains After Saying A-TeluguStop.com

ఏడూ దశాబ్దాలకు పైగా తన పాటలతో యావత్ భారత దేశాన్ని అలరించిన గానకోకిల లతా మంగేష్కర్.ఈమె తన మెలోడీ పాటలతో సంగీత ప్రియులను ఉర్రూత లూగించారు.

ఈమె 1929, సెప్టెంబర్ 28న జన్మించారు.ఈమె ప్రస్తుత వయసు 92 సంవత్సరాలు.

తన కెరీర్ లో లతా మంగేష్కర్ 26 భారతీయ భాషల్లో దాదాపు 25 వేలకు పైగా పాటలు పాడారు.ఇక ఈమె గత నెల రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు తుదిశ్వాస విడిచారు.

ఈమె మరణం ఇండియన్ సినీ అభిమానులను మాత్రమే కాదు విదేశీయులను కూడా దుఃఖంలో ముంచేసింది.

అంతటి గొప్ప వ్యక్తి అంత్యక్రియల సందర్భంగా షారుఖ్ ఖాన్ చేసిన పని దేశ వ్యాప్తంగా వైరల్ అయ్యింది.

ఆయన లతా మంగేష్కర్ అంత్యక్రియలకు వెళ్లిన సమయంలో ఆమె పాదాల వద్ద ఉమ్మేసాడని గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఈయనపై ట్రోల్ చేస్తున్నారు.అయితే ఈ మ్యాటర్ లో అసలు నిజం ఏంటంటే.ఈయన తమ మత ఆచారం ప్రకారం నమాజ్ చేసిన తర్వాత మాస్క్ తీసి గాలి బయటకు ఉదారు.

ఇది చూసిన అక్కడి కొంత మంది అతడిపై విమర్శలు చేయడం మొదలు పెట్టారు.ఈయన ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధన చేసాడు కానీ ఉమ్ము వేయలేదు అంటూ ఆయన అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు.చాలా రోజుల తర్వాత ఆయన బయటకు వచ్చి లతా మంగేష్కర్ ను చివరిసారిగా చూసారు.

కొడుకు జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత పెద్దగా బయటకు రావడం లేదు.ఇది తెలియక ఆయనపై ట్రోల్ చేస్తున్న వారికీ షారుఖ్ ఫ్యాన్స్ ఈ విషయాలను షేర్ చేస్తున్నారు.

Trolls on Shah Rukh Khan at Lata Mangeshkars funeral

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube