దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు ఆలయ ఈవో జవహర్ రెడ్డి.
ఆలయంలోని బంగారు వాకిలి వద్ద సర్వభూపాల వాహనంపై స్వామి, అమ్మవారులను ఆశీనం చేసి ప్రత్యేక పూజలు, సేవలు, ఆస్థాన మంత్రోచ్ఛారణలు నిర్వహించినట్లు తెలిపారు.
ప్రపంచ మానవాళి సుభిక్షతకు స్వామివారి ఆశీస్సులు వుండాలి అని కోరి పూజించనున్నాము అన్నారు.