మామూలుగా చెప్పాలంటే భార్యా,భర్తల మధ్య గొడవలు రావడం సర్వసాధారణమైన విషయమే.అయితే కొన్ని గొడవలు సరదాగా ఉంటే మరి కొన్ని గొడవలు తీవ్ర పరిణామాలకు దారితీస్తూ ఉంటాయి.
ఇంట్లో భార్య, భర్తలు( Husband ) సంతోషంగా ఉండాలంటే పిల్లలు కూడా ఎంతో సంతోషంగా ఉండి ఆ ఇల్లు ప్రశాంతంగా సౌభాగ్యంతో ఉండేలా చూసుకోవాలి.అయితే పిల్లలకు బుద్ధి చెప్పాల్సిన తల్లిదండ్రులే తరచూ గొడవ పడుతూ ఉంటే పిల్లలు కూడా పెద్దయిన తర్వాత వాటిని అనుసరించడానికి ప్రయత్నిస్తారు.
అయితే కుటుంబ సాంప్రదాయాన్ని కాపాడుకోవడానికి ఇంట్లో వాస్తు పరంగా చిన్న చిన్న మార్పులు చేస్తే మంచిదని వాస్తు నిపుణులు చెబుతున్నారు.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

తెల్లచందనంతో చేసిన ఒక చెక్క విగ్రహాన్ని తెచ్చి ఇంట్లో ఉంచడం వల్ల ఇలాంటి గొడవలు దూరమవుతాయి.ఎందుకంటే ఇది చాలా శక్తివంతమైనది.ఇది గొడవలను తగ్గిస్తుంది.భార్యా,భర్తల మధ్య ప్రేమను పెంచుతుంది.కుటుంబ సభ్యుల మధ్య పరస్పర విశ్వశాన్ని పెంచుతుంది.వాస్తు శాస్త్రం( Vastu Shastra ) ప్రకారం ఉప్పు ఇంట్లో ఉన్న అన్ని ప్రతికూలతను తొలగిస్తుంది.
అయితే కొద్దిగా ఉప్పు( Salt ) తీసుకొని గదిలో ఏదో ఒక మూలన కళ్ళు ఉప్పును ఉంచి ఒక నెల అలా వదిలేస్తే చాలా మంచిది.

ఒక నెల రోజుల తర్వాత ఆ ఉప్పును తీసి కొత్త ఉప్పును వేయాలి.ఇలా తరచూ చేస్తూ ఉంటే కుటుంబంలో శాంతి ఏర్పడుతుంది.అలాగే కుటుంబ కలహాలు దూరమైతాయి.
అలాగే భోజనం చేసేటప్పుడు కుటుంబ సభ్యులంతా ఒకేసారి తినేందుకు ప్రయత్నించండి.వీలైతే వంట గదిలో తినేందుకు ప్రయత్నించండి.
ఇలా వంట గదిలో అందరూ కలిసి భోజనం చేయడం వల్ల రాహువు వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలు దూరం అవుతాయి.బుద్ధ భగవానుడు( Buddha ) శాంతి సమరసాన్ని సూచిస్తాడు.
ఇలా ఎక్కువగా గొడవలు జరుగుతున్నట్లు అనిపిస్తే ఎరుపు రంగు వేసుకోవడం మానేయడమే మంచిది.