భారత్లో కరోనా మహమ్మారి రోజురోజుకు ఉగ్రరూపం దాల్చుతోంది.కరోనా ప్రభావం అత్యధికంగా కొనసాగుతున్న రాష్ట్రాల జాబితాలో తెలుగు రాష్ట్రాలు టాప్ 10లో ఉన్నాయి.
సోమవారం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసిన సమాచారం ప్రకారం 3,75,799 కేసులతో మహారాష్ట్ర తొలి స్థానంలో ఉంది.ఆ తర్వాత స్థానాల్లో తమిళనాడు (2,13,723), ఢిల్లీ (1,30,606), ఆంధ్రప్రదేశ్ (96,298), కర్ణాటక (96,141), ఉత్తరప్రదేశ్ (66,988), పశ్చిమ బెంగాల్ (58,718), గుజరాత్ (55,822), తెలంగాణ (54,059), బీహార్ (39,176) రాష్ట్రాలు కొనసాగుతున్నాయి.
ఇక కరోనా మరణాల్లో 85.38 శాతం మరణాలు దేశ వ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లోనే నమోదయ్యాయి.ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 32,771 మంది కరోనాతో మరణించగా.వారిలో 27,979 మంది ఏడు రాష్ట్రాలకు చెందినవారే.మహారాష్ట్రలో అత్యధికంగా 13,656 మంది కరోనా కారణంగా మృతి చెందగా, తమిళనాడులో (3,320) ఢిల్లీ (3,827), గుజరాత్ (2,326), కర్ణాటక (1,878), యూపీ (1,426), పశ్చి మ బెంగాల్ (1,372) చొప్పున మరణాలు సంభవించాయి.
గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో దాదాపు 50 వేల కేసులు నమోదవ్వడం కరోనా వ్యాప్తి తీవత్రకు అద్దం పడుతోంది.
ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 14,35,453 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.పాజిటివిటీ రేటు 9.68 శాతంగా ఉంది.మరోవైపు కొవిడ్ బారిన పడి కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది.
గత 24 రోజుల్లోనే 31,991 మంది కోలుకోవడం విశేషం.