బ్రహ్మోత్సవం బిజినెస్ జోరుగా కొనసాగుతోంది.ఈ చిత్రానికి సంబంధించి నైజాం హక్కులను దిల్ రాజు కొనుక్కున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
సినిమాని తెలంగాణాలో పంపిణి చేసేది దిల్ రాజే అయినా, సినిమాని ఆయన కొనుక్కోలేదు.చిత్ర నిర్మాతలు సొంతంగానే దిల్ రాజు ద్వారా నైజాంలో విడుదల చేయాలి అనుకుంటున్నట్లు సమాచారం.
నాగార్జున , కార్తి, తమన్నాల “ఊపిరి” ని కూడా ఇలానే అమ్మకుండా దిల్ రాజు ద్వారానే నైజాంలో విడుదల చేయబోతున్నారు పివిపి నిర్మాతలు.అమ్మేసుకుంటే నిర్మాతలు సేఫ్ జోన్ లో పడేవారే కాని తమ సినిమాల మీద బాగా నమ్మకం ఉన్నట్టుంది.
అందుకే కలెక్షన్లలో సింహభాగాన్ని అందించే నైజాంని అమ్మట్లేదు.
ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఊపిరి మార్చి 25న విడుదల కాబోతుండగా, మహేష్ బ్రహ్మోత్సవం విడుదల తేదిని ఎప్రిల్ 29గా చెబుతున్నా, దీనిపై ఇంకా ఖచ్చితమైన సమచారం దొరకట్లేదు.