తెలంగాణలో వెలుగులోకి వచ్చిన గొర్రెల పంపిణీ కుంభకోణంలో మరో ట్విస్ట్ నెలకొంది.విచారణలో భాగంగా స్కాం అవకతవకల్లో మరో జాయింట్ డైరెక్టర్ హస్తం ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.
ఈ కేసులో ఇప్పటికే నలుగురు ప్రభుత్వ ఉద్యోగులను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు మూడు రోజులపాటు విచారించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే జాయింట్ డైరెక్టర్ పాత్ర బయటకు వచ్చింది.
జాయింట్ డైరెక్టర్ బినామీల ఖాతాల వివరాలను రికార్డుల్లోకి ఎక్కించినట్లు అధికారులు గుర్తించారు.ఈ నేపథ్యంలో జాయింట్ డైరెక్టర్ కు నోటీసులు ఇచ్చి ఏసీబీ విచారించనుంది.