టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో నిందితుడిగా ఉన్న రాజశేఖర్ భార్య తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.కేసును సీబీఐతో విచారించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సుచరిత న్యాయస్థానంలో పిటిషన్ లో పేర్కొన్నారు.
ఈ మేరకు పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు.అదేవిధంగా ఇప్పటివరకు జరిపిన విచారణ వీడియో చూపించాలని సుచరిత న్యాయస్థానానికి విన్నవించారు.
డీజీపీ, సీఎస్, సిట్, హైదరాబాద్ డీసీపీ సెంట్రల్ జోన్లను ప్రతివాదులుగా చేర్చారు.మధ్యంతర ఉత్తర్వులు అవసరం లేదని న్యాయస్థానం అభ్యంతరాలు ఉంటే సంబంధిత కోర్టును ఆశ్రయించవచ్చని పేర్కొన్నారు.
ఈ క్రమంలో ప్రోసిజర్ ఫాలో అవుతున్నామని ప్రభుత్వ న్యాయవాది తెలిపింది.అనంతరం తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది.