భారీ బడ్జెట్ చిత్రాలతో బ్లాక్ బస్టర్ సక్సెస్లను అందుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈసారి ప్రయోగాత్మకంగా తక్కువ బడ్జెట్తో తక్కువ సమయంలో ‘అఆ’ అనే చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు.నితిన్ హీరోగా సమంత హీరోయిన్గా తెరకెక్కబోతున్న ఈ సినిమాను రాధాకృష్ణ నిర్మిస్తున్న విషయం తెల్సిందే.
తాజాగా పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నట్లుగా ముందే ప్రకటించారు.అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను కాస్త ఆలస్యంగా విడుదల చేయనున్నట్లుగా తెలుస్తోంది.
సంక్రాంతి బరిలో ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో’ మరియు బాలకృష్ణ ‘డిక్టేటర్’ చిత్రాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి.ఈ రెండు చిత్రాలతో పాటు మరో రెండు స్టార్ హీరోల సినిమాు సైతం విడుదల అవ్వనున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో ‘అఆ’ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయడం సాహసం అని దర్శకుడు త్రివిక్రమ్ మరియు నిర్మాత రాధా కృష్ణ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.ఫిబ్రవరి 14న ఈ సినిమాను విడుదల చేయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.
డిసెంబర్లోనే ఈ సినిమా చిత్రీకరణ పూర్తి కానుంది.