తెలంగాణ సీఎం ఎంపికపై హైకమాండ్ తీవ్ర కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే.ఈ మేరకు ఢిల్లీలో ఏఐసీసీ ప్రెసిడెంట్ ఖర్గేతో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, మాణిక్ రావు ఠాక్రే, డీకే శివకుమార్ కీలక భేటీ అయ్యారు.
ఈ సమావేశంలో ప్రధానంగా తెలంగాణ ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం ఎంపిక, సీఎల్పీ తీర్మానంపై చర్చిస్తున్నారని తెలుస్తోంది.సమావేశం ముగిసిన అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు డీకే శివకుమార్ హైదరాబాద్ కు బయలు దేరనున్నారని సమాచారం.
మరోవైపు తెలంగాణ నేతలు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలోనే ఉన్నారన్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే డీకే శివకుమార్ తో ఉత్తమ్ ఇప్పటికే సమావేశం అయ్యారు.