బాధిత కుటుంబానికి నిత్యవసర సరుకులు, నగదు అందజేత

రాజన్న సిరిసిల్ల జిల్లా :బాధిత కుటుంబానికి నిత్యవసర సరుకుల తో పాటు నగదును హెల్పింగ్ అండ్ సొసైటీ అందజేసి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు.ఎల్లారెడ్డిపేట( Yellareddipeta ) మండలం సింగారం గ్రామానికి చెందిన పారిశుద్ధ కార్మికుడి కుమారుడు అనారోగ్యంతో గత వారం అకస్మాత్తుగా మృతి చెందగా వారి కుటుంబానికి శుక్రవారం నిత్యవసర సరుకులతో పాటు 2500 నగదును అందజేశారు.

 Providing Essential Commodities And Cash To The Affected Family Yellareddipeta-TeluguStop.com

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మృతునికి భార్య పిల్లలు ఉన్నారని రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం వారిది అని అన్నారు.వారి పిల్లలకు చదువులకయ్యే ఖర్చును కూడా తామే సమకూరుస్తామని భరోసా ఇచ్చారు.

అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం( Telangana State Govt ) ద్వారా వారి కుటుంబాన్ని ఆదుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో నాగరాజు, రవీందర్, దేవరాజు, రాజు, దేవయ్య, మల్లేష్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube