రాజన్న సిరిసిల్ల జిల్లా :బాధిత కుటుంబానికి నిత్యవసర సరుకుల తో పాటు నగదును హెల్పింగ్ అండ్ సొసైటీ అందజేసి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు.ఎల్లారెడ్డిపేట( Yellareddipeta ) మండలం సింగారం గ్రామానికి చెందిన పారిశుద్ధ కార్మికుడి కుమారుడు అనారోగ్యంతో గత వారం అకస్మాత్తుగా మృతి చెందగా వారి కుటుంబానికి శుక్రవారం నిత్యవసర సరుకులతో పాటు 2500 నగదును అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మృతునికి భార్య పిల్లలు ఉన్నారని రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం వారిది అని అన్నారు.వారి పిల్లలకు చదువులకయ్యే ఖర్చును కూడా తామే సమకూరుస్తామని భరోసా ఇచ్చారు.
అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం( Telangana State Govt ) ద్వారా వారి కుటుంబాన్ని ఆదుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో నాగరాజు, రవీందర్, దేవరాజు, రాజు, దేవయ్య, మల్లేష్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.