మామిడిపల్లిలో మాజీ సీఎం చంద్రబాబు ( Former CM Chandrababu )పాలనకు అద్దం పడుతున్న నీటి కటకట!వేములవాడ ఎమ్మెల్యే దత్తత గ్రామంలో నీటి కొరత పై ఆందోళన.రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలో నీటి కోసం అనేక ఇబ్బందులకు గురవుతున్నట్లు అక్కడ ప్రజలు బిందెలతో గ్రామపంచాయతీ ముందు నిరసన తెలిపారు.
బోరు బావి నీటి లో ఫ్లోరైడ్ రావడంతో అనారోగ్యానికి గురవుతున్నట్లు ఎముకలు చచ్చిబడి పోతున్నట్లు గ్రామస్తులు తెలిపారు.ఇప్పటికైనా మా గ్రామాన్ని దత్తత తీసుకున్న ఎమ్మెల్యే మంచినీటి సమస్యను తీర్చాలని డిమాండ్ చేశారు.