రాజన్న సిరిసిల్ల జిల్లా దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారిని సోమవారం టీఎస్ ఆర్డిసి చైర్మన్ మిట్ట శ్రీనివాస్ రాజన్నకు ఇష్టమైన కోడె మొక్కులు చెల్లించుకుని రాజన్న ప్రత్యేక పూజలు చేసి సేవలో తరించారు.అనంతరం నాగిరెడ్డి మండపంలో అర్చకులు ఆశీర్వదించారు.
వారికి ఆలయ పర్యవేక్షకులు తిరుపతి రావు కండువా కప్పి ప్రసాదాలు అందజేశారు.వారి వెంట ప్రోటోకాల్ పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు,ఆలయ ఆలయ ఇన్స్పెక్టర్ అశోక్ పోసాని రాజ్ కుమార్ లు ఉన్నారు.