సాధారణంగా మన దేశంలోని ప్రజలు చాలామంది వాస్తు శాస్త్రాన్ని బలంగా నమ్ముతారు.ఇల్లు నిర్మించాలని భావించినప్పుడు స్థలంలో ఎలాంటి చెట్లు ఉండాలి.
ఏ చెట్టు ఏ వైపు ఉంటే మంచిదని కూడా చాలామంది ఆలోచిస్తూ ఉంటారు.స్థలం విశాలంగా ఉన్నప్పుడు ప్రతి గృహానికి నిర్దేశించిన దిక్కులో వృక్షాలు ( Trees ) ఉండడం శుభమని చాలా మంది ప్రజలు నమ్ముతారు.
చెట్లు కార్బన్ డయాక్సైడ్ ను పీల్చుకొని ఆక్సిజన్ ను విడుదల చేస్తాయి.కాబట్టి ఇంటి ప్రాంగణంలో చెట్లు ఉండడంవల్ల వాతావరణం, గాలి పరిశుద్ధంగా ఉంటుంది.
ముఖ్యంగా రావి చెట్టు( Peepal Tree ) సహా అనేక చెట్లను హిందువులు పవిత్రంగా భావించి పూజిస్తారు.రావి చెట్టు గురించి వర్ణన శ్రీకృష్ణుని భగవద్గీతలో ( Bhagavadgita ) కూడా ఉంది.
రావి చెట్టుపై సకల దేవతలు నివసిస్తారని చెబుతూ ఉంటారు.అయితే రావి చెట్టు 24 గంటల పాటు ఆక్సిజన్ అందజేస్తున్నప్పటికీ ప్రజలు తమ ఇంట్లో, పెరట్లో దీనిని అసలు నాటరు.
ఇంట్లో ఈ చెట్టును ఎందుకు ఉంచకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
రావి చెట్టు కొన్ని సంవత్సరాలలో పెద్ద వృక్షంగా ఎదుగుతుంది.కాబట్టి దాని వేర్లు చాలా దూరం వరకు వ్యాపిస్తాయని ప్రజలు నమ్ముతారు.ఇంట్లో ఈ చెట్టు పెరిగితే దానివేర్లు ఇంటి పునాదిని బలహీనపరుస్తాయని భావిస్తారు.
ఇది ఇంటి పునాదిని కదిలించగలదు.ముఖ్యంగా చెప్పాలంటే రావి చెట్టు నీడ ఒక నిర్దేశాదిశా నుంచి ఇంటిపై పడితే ఆ కుటుంబ సభ్యులలో భేదభిప్రాయాలు వస్తాయని చాలామంది నమ్ముతారు.
అందువల్ల ఆ కుటుంబ సభ్యుల పురోభివృద్ధికి అడ్డంకులు ఏర్పడవచ్చు.రావి చెట్టు నీడ మనసులో ప్రతికూల ప్రకంపనలను సృష్టిస్తుంది.ముఖ్యంగా చెప్పాలంటే ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు రావి చెట్టు నీడ ఇంటిపై పడితే అది హానికరమని నమ్ముతారు.ఇది ఆ ఇంటి కుటుంబ సభ్యుల పై ప్రతికూల ప్రభావం చూపుతోందని చెబుతూ ఉంటారు.