దీపావళి సందడి షురూ అయింది.దాంతో ఆన్లైన్ మార్కెట్ సందడి కూడా మొదలయ్యింది.
ఈ సందర్భంగా ప్రముఖ స్మార్ట్ఫోన్ కంపెనీ ‘వివో’ తన ఉత్పత్తులపై ఆకర్షణీయమైన ఆఫర్లతో కస్టమర్లను ఉక్కిరిబిక్కిరి చేయడానికి సిద్ధం అయింది.అవును, వివో ‘బిగ్ జాయ్ దీపావళి’ కార్యక్రమాన్ని ఒకదానిని ప్రకటించింది.
ఈ క్రమంలో వివో ఎక్స్80 సిరీస్, వై75 సిరీస్, వివో వీ25 సిరీస్, వై35 సిరీస్, ఇతర వై సిరీస్ స్మార్ట్ ఫోన్లపై కనివిని ఎరుగని డిస్కౌంట్ను తీసుకొచ్చింది.
ICICI, SBI, ఇతర బ్యాంకుల క్రెడిట్/డెబిట్ కార్డు EMIపై అనేక ప్రయోజనాలు కల్పిస్తోంది.వివో ఎక్స్80 సిరీస్పై రూ.8,000 క్యాష్ బ్యాక్, వివో 25 సిరీస్ ఫోన్లపై రూ.4,000 క్యాష్ బ్యాక్ బెనిఫిట్స్ దీనిద్వారా పొందవచ్చు.దానికి మీరు చేయవలసిందల్లా ఒక్కటే, ముందు రూ.101 చెల్లించి ఎక్స్, వీ సిరీస్లో నచ్చిన ఫోన్ను తీసుకెళ్లొచ్చని వివో తాజాగా ప్రకటించింది.
![Telugu Bumper, Latest, Ups-Latest News - Telugu Telugu Bumper, Latest, Ups-Latest News - Telugu](https://telugustop.com/wp-content/uploads/2022/10/latest-news-technology-updates-technology-news.jpg )
అంటే ఈ ఆఫర్లో రూ.101 ప్రారంభంలో చెల్లించి ఆ తర్వాత EMI కట్టాల్సి ఉంటుంది.అయితే ఇంకా దీని పై వివో పూర్తి సమాచారం ఇవ్వాల్సి ఉంది.
అలాగే ఈ ఆఫర్పై పూర్తి వివరాల కోసం మీ సమీపంలోని వివో రిటైలర్ ని కూడా సంప్రదించవచ్చు.రూ.15వేలకు పైన ఏ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసినా, 6 నెలల అదనపు వారంటీ కూడా ఇవ్వబోతున్నారు.వై సిరీస్ ఫోన్లను EMIపై తీసుకుంటే రూ.2,000 క్యాష్బ్యాక్ ఇస్తున్నట్టు కూడా చెబుతున్నారు.కాగా అక్టోబర్ 31 వరకు మాత్రమే ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయని, సత్వరమే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని కోరుతున్నారు.