కూచిపూడి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

సూర్యాపేట జిల్లా: కోదాడ రూరల్ మండలం కూచిపూడి గ్రామంలో ట్రాక్టర్ అదుపుతప్పి కరెంటు స్తంభానికి ఢీ కొట్టి పల్టీ కొట్టడంతో ఒకరు మృతి చెందగా,ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పొలాల్లో వరి ధాన్యం బస్తాల లోడ్ చేసుకొని ఆరుగురు హమాలీలతో ఇంటికి వస్తున్న ట్రాక్టర్,డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా కరెంట్ స్తంభాన్ని ఢీ కొట్టి పల్టీ కొట్టింది.

ఈ ఘటనలో కూచిపూడి గ్రామానికి చెందిన వనమాల శివయ్య (55) సంఘటనా స్థలంలో మృతి చెందగా,వనమాల పోనారావు(58),తిరుపతయ్య(37)అనే ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో ఖమ్మం ఆస్పత్రికి తరలించారు.మరో వ్యక్తి మెట్టే సీతయ్య(50)కు స్వల్ప గాయాలయ్యాయి.

భువనగిరి ఖిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం : ఎమ్మెల్యే మందుల సామేల్

Latest Suryapet News