1.మెల్బోర్న్ తెలంగాణ ఫోరం అధ్యక్షుడిగా సురేష్
సికింద్రాబాద్ ఘాస్ మండికి చెందిన గంగిరెడ్డి సురేష్ ముదిరాజ్ ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ తెలంగాణ ఫోరం అధ్యక్షుడు గా ఎన్నికయ్యారు.
2.కొత్త టెలిస్కోప్ ఆవిష్కరించిన నాసా
అంతరిక్ష రహస్యలను ఛేదించే టెలిస్కోప్ ను నాసా ఆవిష్కరించింది.
3.ఇండోనేషియాలో పేలిన అగ్నిపర్వతం : 13 మంది మృతి
ఇండోనేషియాలోని జావా లో అతిపెద్ద అగ్నిపర్వతం ఒకటి ఆదివారం బద్దలైంది.ఈ ఘటనలో 13 మంది మృతి చెందారు.
4. న్యూ యార్క్ ను భయపెడుతున్న ఒమిక్రాన్
న్యూ యార్క్ లో ఒమి క్రాన్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది.డెల్టా వేరియంట్ కంటే ప్రమాదకరమైన ఒమిక్రాన్ వైరస్ న్యూయార్క్ నగరంలో ప్రవేశించింది.ఇప్పటివరకు ఎనిమిది కేసులు నమోదయ్యాయి.
5.రేపు రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటన
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రేపు భారత్ లో పర్యటించనున్నారు.
6.బ్రిటన్ లో 160 ఒమిక్రాన్ కేసులు
బ్రిటన్ లో 160 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.
7.ఇండోనేషియాలో భారీ భూకంపం
ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 6.0 గా నమోదయ్యింది.
8.మాలి లో అల్ ఖైదా నరమేధం
అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా అనుబంధ ఉగ్ర సంస్థల్లో ఒకటి ఆఫ్రికా ఖండంలోని మాలి దేశంలో నరమేధం సృష్టించింది.50 మంది తో వెళ్తున్న వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని కాల్పులకు దిగింది.ఈ ఘటనలో 31 మంది మృతి చెందారు.
9.ఒమిక్రాన్ పై డబ్లూ హెచ్ వో ప్రకటన
ఒమిక్రాన్ వైరస్ కారణంగా ఇప్పటి వరకు ఒక్కరు కూడా చనిపోలేదు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.
10. ఐరోపా దేశాల్లో కరోనా వాక్సిన్ తీసుకోకపోతే జరిమానా
ఆఫ్రికా దేశాల్లో కరోనా కేసులు పెరగకుండా ఉండేందుకు వాక్సినేషన్ వేయించుకోని వారిపై ఆంక్షలు విధిస్తున్నారు.భారీ జరిమానా విధించే విధంగా నిబంధనలు రూపొందించారు.