కరోనా అనేది ప్రపంచానికి పెను భూతంలా మారిందన్న విషయం ప్రతి ఒక్కరు అంగీకరించక తప్పదు.ఎక్కడ పుట్టిందో ఏమో ఈ వైరస్ ప్రపంచాన్ని కబలించి వేస్తోంది.
అయితే మన దేశంలో మొదటి దశ కరోనా వేవ్ ఎంతలా విజృంభించిందో మనం చూసాం.సామాన్యుల మొదలు సెలెబ్రిటీల వరకు ప్రతి ఒక్కరిని కరోనా ఇబ్బంది పెట్టిన విషయం తెలిసిందే.
అయితే ముఖ్యంగా కరోనా కాలంలో అందరికంటే ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొన్నది వలస కార్మికులు.ఇక వారిది రాష్ట్రం వేరైనప్పటికీ ఇక్కడ ఉపాధి కోసం వలస వచ్చి చిన్న చిన్న గుడారాలలో కాలం వెళ్ళదీసే వారి జీవితాలు కాలినడకన తమ సొంతూళ్లకు పయనమైన పరిస్థితి ఉంది.
ఇక వారిని ఆదరించి ఒక్కసారిగా రీల్ హీరో సోనూసూద్ దేవుడిగా మారిపోయాడు.ఇక స్వంత ఖర్చులతో బస్సులను వేసి తమ స్వంత ఊళ్లకు వారిని చేరవేసి దేశ ప్రజల మన్ననలు అందుకున్నాడు.
అయితే కరోనా నుండి వేల మందిని ఆదుకున్న సోనూసూద్ ఇటీవల కరోనా బారిన పడ్డ సంగతి తెల్సిందే.అయితే తాజాగా అభిమానులకు సోనూసూద్ శుభవార్త తెలిపాడు.
నాకు కరోనా నెగెటివ్ వచ్చిందని, నేను ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్న వారికి ధన్యవాదాలు తెలిపుతున్నట్లు రియల్ హీరో సోనూసూద్ ప్రకటించాడు.