తెలుగు సినీ నటుడు రానా నటన గురించి అందరికీ తెలిసిందే.లీడర్ సినిమాతో సినీపరిశ్రమలోకి పరిచయమైన రానా ఆ సినిమాలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఇక ఆ తర్వాత వరుస సినిమాల్లో విభిన్నమైన పాత్రల్లో నటించారు.ఇక బాహుబలి సినిమా తర్వాత రానా క్రేజ్ మరింతగా పెరిగింది.
ఇదిలా ఉంటే రానా ఓ స్టార్ దర్శకుడి శిష్యుడితో ఓ సినిమా చేయనున్నాడు.
ప్రస్తుతం రానా వరుస సినిమాల్లో బిజీగా ఉన్నాడు.
ఇటీవలే ప్రభు దర్శకత్వంలో విడుదలయిన అరణ్య సినిమా రానా నటనకు గుర్తింపును అందించింది కానీ సినిమాకు అంతగా విజయం రాలేకపోయింది.ఇక రానా పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘అయ్యప్పన్ కోషియుమ్’ రీమేక్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే వేణు దర్శకత్వంలో విరాటపర్వం సినిమాల్లో కూడా నటిస్తున్నాడు రానా.ఇందులో రానా నక్సలైట్ నాయకుడి పాత్రలో కనిపించనున్నాడు.ఇక ఈ సినిమా ఈనెల 30 న విడుదల కానుందని సినీ బృందం తెలిపింది.
ఇదిలా ఉంటే సినిమా కథను, పాత్రను దృష్టిలో పెట్టుకొని పెంచుకునే రానా.అరణ్య సినిమాతో కాస్త నిరాశ పరిచాడు.ఇక రానా కొత్త డైరెక్టర్లకు, విభిన్న కథలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తాడు.
ఇదిలా ఉంటే రానా ప్రస్తుతం కొత్త కథల ఎంపికలో బిజీగా ఉన్నాడని తెలుస్తుంది.త్వరత్వరగా కొత్త ప్రాజెక్టులను మొదలు పెట్టాలనే ఆలోచనలో ఉన్నాడు.
ఇక సుకుమార్ శిష్యుడైన వెంకీ వినిపించిన కథకు రానా ఓకే చెప్పినట్లు తెలిసింది.ఇక ఈ కథ 1940 నాటి కాలంలో లో జరిగిన కథను దృష్టిలో పెట్టుకొని వెంకీ తీయనున్నాడట.
ఇక ఈ సినిమా యాక్షన్ తో పాటు ఎమోషనల్ గా తెరకెక్కనుంది.ఇక ఈ సినిమా పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటన చేయనున్నట్లు సినీ బృందం తెలిపారు.