సెలబ్రెటీలు ఎక్కడ ఉన్న వారిచుట్టూ మీడియా కన్ను ఎప్పుడు ఉంటుంది.వారు చేసే ప్రతి పని మీద మీడియా ఫోకస్ చేస్తుంది.
ముఖ్యంగా ఇండియాలో మోస్ట్ క్రీజీ న్యూస్ అంటే ఎంటర్టైన్మెంట్, క్రికెట్.ఈ రెండు రంగాలలో ఉన్న సెలబ్రెటీలు వ్యక్తిగత జీవితాలపై కూడా మీడియా వార్తలు రాస్తూ ఉంటుంది.
ఎవరు ఎవరితో రిలేషన్ లో ఉన్నారు, ఎవరు ఎందుకు బ్రేక్ అప్ అయిపోయారు.అక్కడ ఆ సెలబ్రెటీ ఎం చేస్తున్నారు అనే విషయాలని బూతద్దంలో పెట్టి మీడియా చూపిస్తుంది.
ఈ కారణంగా ఒక్కోసారి మీడియా ఫోటోగ్రాఫర్స్ చేసే హడావిడి, అతి వలన సెలబ్రెటీలు వారి కుటుంబం సభ్యుల మధ్య తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు.ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా గడుపుదామని వస్తే అక్కడికి కూడా కెమెరాలతో వచ్చి చుట్టుముట్టేస్తారు.
అయితే ఈ మధ్యకాలంలో ఇన్స్టాగ్రామ్ లో సెలబ్రెటీలు తన పర్సనల్ ఫోటోలు, వీడియోలని షేర్ చేసుకుంటున్నారు.ఇప్పుడు వీటిని కొన్ని మీడియా సంస్ధలు సెలబ్రెటీల పర్మిషన్ లేకుండానే వాడేసుకుంటున్నాయి.
దీనిపై చాలా సందర్భాలలో చాలా మంది సెలబ్రెటీలు సీరియస్ అయ్యారు.తాజాగా బాలీవుడ్ స్టార్ నటి అనుష్క శర్మ కూడా సీరియస్ అయ్యింది.ప్రస్తుతం ఆమె గర్భవతిగా ఉంది.త్వరలో డెలివరీ కావడానికి రెడీ అవుతుంది.ఇదిలా ఉంటే తాజాగా ఆమె ముంబై జూహు నివాసంలోని బాల్కనిలో కోహ్లీ, అనుష్క దంపతులు కూర్చొని ప్రశాంతగా అల్పహారం తీసుకుంటున్నారు.ఈ పోస్ట్ ని అనుష్క శర్మ తన ఇన్ స్టా గ్రామ్ స్టోరీస్ లో పోస్ట్ చేసింది.
అనుష్క పోస్ట్ చేసిన ఫోటోను విరుష్క దంపతుల అనుమతి లేకుండా తీసి ఓ ఫోటోగ్రాఫర్ తమ పబ్లికేషన్స్ లో ఉపయోగించుకున్నారు.దీనిపై ఆమె సీరియస్ అయ్యి మేము మనుషులమే, మాకు ప్రైవసీ ఉంటుంది.
ఎటువంటి అనుమతులు లేకుండా ఫోటోలు తీయడం సమంజసం కాదని అనుష్క శర్మ ఫైర్ అయింది.ఇలాంటి పనులు తక్షణమే మానివేయాలని ఆమె సూచించింది.