ఫిదా సినిమాతో టాలీవుడ్ లో అందరిని ఫిదా చేసిన ముద్దుగుమ్మ సాయి పల్లవి.ఈ భామ తెలుగులో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న ఇతర హీరోయిన్స్ కి భిన్నంగా తనకి తన మనసుకి నచ్చే సినిమాలు చేస్తూ కొత్తదనంతో ముందుకి వెళ్తుంది.
ఆమె చేసిన ప్రతి సినిమాలో సాయి పల్లవి క్యారెక్టరైజేషన్ కచ్చితంగా కొత్తగా ఉండేలా చూసుకుంటుంది.ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ, వేణు ఊడుగుల దర్శకత్వంలో విరాటపర్వం అనే సినిమాలు చేస్తుంది.
రెండు సినిమాలలో ఆమె పాత్రలు పూర్తి భిన్నంగా ఉంటాయి.ఇదిలా ఉంటే సినిమాలో ఆమె పాత్రల విషయంలో ఎంత డెడికేషన్ గా ఉంటుందో లైఫ్ విషయంలో కూడా అంతే డెడికేషన్ చూపిస్తుంది.
ఎక్కువగా ఆధ్యాత్మికం భావాలతో ఉండే సాయి పల్లవి జీవితంలో పెళ్లి చేసుకోకూడదు అని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.అయితే ఈ నిర్ణయం తీసుకోవడానికి కేవలం అమ్మానాన్నలని చూసుకోవడానికి మాత్రమే అని ఆమె చెబుతూ ఉన్న కూడా దీనికి బలమైన కారణం ఉందనే మాట వినిపిస్తుంది.
కాలేజీ రోజుల్లో ఆమె ఒకరిని ప్రేమించిందని, అయితే ఆమె ప్రేమలో ఫెయిల్ అవడంతో తరువాత డాక్టర్ చదువు ఫినిష్ చేసి అనుకోకుండా సినిమాల వైపు వచ్చిందని తెలుస్తుంది.ఆమెకి ఉన్న డాన్సింగ్ టాలెంట్ కారణంగానే ఆమె హీరోయిన్ గా అవకాశాలు అందుకుంది.
తరువాత తన నటనతో ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది.అయితే ఫిదా సినిమాలో తల్లిదండ్రుల కోసం పెళ్లి చేసుకోకూడదు అని అనుకునే భానుమతి పాత్ర తరహాలోనే నిజ జీవితంలోను అలాగే ఉండిపోతా అని ఈ అమ్మడు చెబుతుంది.
కాని లవ్ ఫెయిల్యూర్ ఆమెకి పెళ్లి మీద మనసు విరిగిపోవడానికి కారణం అని సౌత్ ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.