భవిష్యత్తులో ఆంధ్ర ప్రదేశ్ కి ముగ్గురు ముఖ్య మంత్రులంటున్న షకీలా...

ప్రముఖ దర్శకుడు వి సతీష్ దర్శకత్వం వహించిన టువంటి చిత్రం “షకీలా రాసిన మొట్ట మొదటి కుటుంబ కథా చిత్రం”.ఈ చిత్రంలో సీనియర్ నటి షకీలా విక్రాంత్, పాయల్ ఘోష్, తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.అయితే ఈ చిత్రానికి సంబంధించి నటువంటి 0.50 నిమిషాల నిడివిగల టీజర్ని చిత్ర యూనిట్ సభ్యులు విడుదల చేశారు.

 Shakila Comments On Ap Three Capitals-TeluguStop.com

అయితే ఇందులో భాగంగా నటి షకీలా ఆంధ్ర ప్రదేశ్ తాజా రాజకీయ పరిణామాలపై తనదైన శైలిలో సెటైర్లు వేశారు.ఇందులో ముఖ్యంగా షకీలా పేపర్ చదువుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు అనే అంశాన్ని చదువుతుండగా ఇదేంటని తన పక్కనే ఉన్నటువంటి తన అసిస్టెంట్ ని అడుగుతారు.

అప్పుడు తన అసిస్టెంట్ కూడా అవును మేడం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానిలని సమాధానమిస్తాడు.దీంతో ఇలా అయితే భవిష్యత్తులో రాష్ట్రానికి ముగ్గురు ముగ్గురు ముఖ్యమంత్రులని అన్నా కూడా ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదని అని అంటుంది.

అయితే ఈ టీజర్ లో దర్శకుడు కేవలం రాజకీయ సంబంధించినటువంటి ఈ విషయాన్ని మాత్రమే చూపించాడు.కానీ ఈ చిత్ర టైటిల్ ను చూస్తే మాత్రం కుటుంబ కథా చిత్రమని పెట్టాడు.

దీంతో ఈ విషయంపై కొంత సందిగ్ధత నెలకొంది.

Telugu Andhra Pradesh, Ap, Shakila, Shakila Ap-Movie

అయితే ఇప్పటికే ఈ చిత్రంలోని పలు కీలక సన్నివేశాలు పూర్తయినట్లు అంతేగాక ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేసేందుకు దర్శకుడు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.అయితే ఏదేమైనప్పటికీ షకీలా కి మాత్రం ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గడం లేదు. ఆమె చిత్రాలు వస్తున్నాయి అంటే ఇప్పటికీ అభిమానులు థియేటర్లకు క్యూ కడతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube