చెల్లిని అత్యాచారం చేసిన వ్యక్తిని కిరాతకంగా చంపేసిన అన్న

మహిళల మీద దాడులు, అత్యాచారాలు, హత్యలని కంట్రోల్ చేయడానికి ప్రభుత్వాలు కఠిన చట్టాలని తీసుకొస్తుంది.ఆ చట్టాలతో అంతే కఠిన శిక్షలు వేస్తుంది.

 Basveswar Nagar Fakruddin Sadhaf-TeluguStop.com

అయిన కూడా కామాంధుల ఆగడాలు మాత్రం తగ్గడం లేదు.ప్రతి రోజు ఏదో ఒక చోట చిన్నారుల నుంచి పెద్దవాళ్ళ వరకు మహిళలపై అత్యాచారాలు, దాడులు జరుగునే ఉన్నాయి.

అలాంటి ఘోరాలలకి సంబందించిన కథనాలు బయటకి వస్తూనే ఉన్నాయి.కొన్ని చోట్ల ఇలాంటి ఘోరాలు జరుగుతున్న చోట్ల సహనం కోల్పోయి ప్రజలే చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని శిక్షలు వేస్తున్నారు.

ఇప్పుడు అలాంటి ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది.

కర్ణాటకలోని ధార్వాడ్‌ జిల్లాలో బసవేశ్వర్ నగర్ కి చెందిన పక్రుద్దీన్ నదాఫ్(53) 11 ఏళ్ల మైనర్‌ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

బాలిక ఒంటరిగా ఉండడాన్ని గమనించిన నదాఫ్‌ మాయమాటలు చెప్పి తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.అత్యాచారం చేసి ఆ బాలికని ఆమె ఇంటికి తీసుకొస్తుండగా కుటుంబ సభ్యులు దానిని గమనించి అతని మీద దాడి చేశారు.

దీంతో తీవ్ర గాయాలకి గురైన అతనిని పోలీసులకి అప్పగించారు.పోలీసులు నిందితున్ని హాస్పిటల్ కి తరలించారు.అయితే తన చెల్లిపై నదాఫ్‌ ఒడిగట్టిన ఘాతుకానికి కోపం చల్లారని ఆమె సోదరుడు ఆస్పత్రికి వచ్చి నిందితుడిని కత్తితో పొడిచి చంపాడు.అదే సమయంలో అక్కడ ఉన్న పోలీసులు జరిగిన ఘటనకి నిర్ఘాంత పోయి వెంటనే అతనిని అదుపులోకి తీసుకున్నారు.

అతని మీద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు.ఇప్పుడు ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube