ఇలాంటి తల్లి తండ్రులని ఎక్కడా చూసి ఉండరు.తమకి పుట్టిన పిల్లలు ఎంతో సంతోషంగా, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేలా చూసుకోవాలని అందరు తల్లి తండ్రులు అనుకుంటారు.
కానీ అమెరికాలో లాస్ఏంజిల్స్ లో మాత్రం ఓ జంట తమ పిల్లలని చిత్ర విచిత్రంగా పెంచింది.కొన్నేళ్ళ పాటు వారు ఆ పిల్లలపై చూపించిన క్రూరమైన పసాచికత్వానికి పోలీసులు ముగింపు ఇచ్చారు.
ఆ వివరాలలోకి వెళ్తే.
లాస్ ఏంజిల్స్ లో ఓ స్కూల్ నివహిస్తున్న ఇద్దరు దంపతులుకి 12 మంది సంతానం , తమ పిల్లల్ని మాత్రం స్కూల్ లో చేర్చకుండా ఇంట్లో నుంచీ బయటకి రానియ్యకుండా , బోనుల్లో ఉంచుతూ ,కుర్చీలకి కట్టి చిత్ర హింసలు పెట్టేవారట.
మీ పిల్లలు ఎక్కడ ఉన్నారు అని అడిగిన వారికి ఇంట్లో ఉండే చదవుతారు బయటకి రానని చెప్పేవారట.ఇదిలాఉంటే ఒకరోజు వారి పిల్లల్లో ఒక అమ్మాయి వీరి చెరనుంచి తప్పించుకుని పోలీసులని ఆశ్రయించింది.
పోలీసులు వచ్చి తలుపులు తీసి చూడగా ఎంతో దారుణమైన స్థితిలో పిల్లల్ని చూసి చేలించి పోయారట.వారిని ఆ తల్లి తండ్రుల చెరనుంచీ విడిపించి ఆ భార్యా భర్తలని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిచారు.దాంతో కోర్టు వారికి జీవిత ఖైదు విధించింది.