రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

సూర్యాపేట జిల్లా:ద్విచక్ర వాహనాన్ని డీసీఎం వెనుక నుండి ఢీ కొట్టడంతో ఓ మహిళ అక్కడిక్కడే మృతి చెందిన ఘటన తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని మద్ధిరాల మండలం పోలుమల్ల వద్ద చోటుచేసుకుంది.

మృతురాలు తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన జటంగి రాములమ్మ (50) గా గుర్తించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం సూర్యాపేట జనరల్ ఆసుపత్రికి తరలించి,కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Validation Check 2026

Latest Suryapet News