నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి కుడి కాల్వకు నీరు విడుదల అయింది.ఈ మేరకు రెండు వేల క్యూసెక్కుల నీటిని ఏపీ అధికారులు విడుదల చేశారు.
ఒంగోలు చీఫ్ ఇంజినీర్ ఆధ్వర్యంలో అధికారులు గేట్లను ఎత్తారు.అయితే బలవంతంగా తాత్కాలిక విద్యుత్ తో కుడి కాల్వకు నీటి విడుదల చేసినట్లు తెలుస్తోంది.
మొత్తం 26 గేట్లలో 13 గేట్ల వద్ద తెలంగాణ, మరో 13 గేట్ల వద్ద ఏపీ పోలీసులు భారీగా మోహరించారు.ఈ క్రమంలోనే ముళ్లకంచె, టెంట్లు వేసి ఏపీ పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.
అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత నాగార్జునసాగర్ నిర్వహణను కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించింది.అయితే నదీ జలాలు, విద్యుత్ పంపిణీ విషయంలో తెలంగాణ, ఏపీ మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే.