మ్యాచో స్టార్ గోపీచంద్ కు టాలీవుడ్ లో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.టాలీవుడ్ మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు సంపాదించుకున్న హీరోల లిస్టులో గోపీచంద్ కూడా ఉన్నారు.
ఈయన హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకు పోతున్నాడు.ఇటీవలే గోపీచంద్ సంపత్ నంది డైరెక్షన్ లో చేసిన సీటిమార్ సినిమాతో ప్రేక్షకుల చేత సీటిమార్ వేయించాడు.
గోపీచంద్ సీటిమార్ సినిమా తర్వాత మారుతీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.“పక్కా కమర్షియల్” సినిమా షూటింగ్ జరుగుతుండగానే మరొక సినిమా స్టార్ట్ చేసాడు గోపీచంద్.ఈ సినిమా గోపీచంద్ కెరీర్ లో 30వ సినిమాగా తెరకెక్కనుంది.డైరెక్టర్ శ్రీవాస్ తో గోపీచంద్ మూడవసారి చేయడానికి రెడీ అయిపోయాడు.ఇప్పటికే లక్ష్యం, లౌక్యం సినిమాలు చేసాడు.
ఇక ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాడు.
ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ నెలలోనే స్టార్ట్ అయ్యింది.కానీ కరోనా కారణంగా చిత్ర యూనిట్ సైలెంట్ గా ఉంది.
ఇక ఇంత కాలానికి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసింది.దీంతో కొత్త పోస్టర్ ను రిలీజ్ చేసి మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ చేసారు.
ఈ సినిమాలో డింపుల్ హయతి కథానాయికగా నటిస్తుంది.
ఇక తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ ద్వారా ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ సందడి చేస్తున్నట్టు తెలిపారు.ఆమె ఖుష్బూ.ఈమె కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తుందని తెలిపారు.
ఒక పోస్టర్ ద్వారా ఈ విషయాన్నీ చెప్పారు.ఈ రోజే ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో స్టార్ట్ అయ్యింది.
కీలక తారాగణం మీద షూటింగ్ జరగనున్నట్టు తెలుస్తుంది.ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పథకంగా నిర్మిస్తుండగా మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు.