సీఎం జగన్ పై సీరియస్ వ్యాఖ్యలు చేసిన రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు..!!

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.దేశంలోనే రాష్ట్రాన్ని అప్పులలో నెంబర్ వన్ స్థానంలో నిలిపిన ఘనుడు జగన్ అని మండిపడ్డారు.

 Rebel Mp Raghuramakrishna Raju Made Serious Comments On Cm Jagan ,mp Raghuramakr-TeluguStop.com

అప్పుల్లో మాత్రమే కాదు రైతుల ఆత్మహత్యలు ఇంకా గంజాయి సాగుల్లో కూడా మొదటి స్థానంలో నిలిపారని జగన్ పాలనలో రాష్ట్రం దాదాపు 50 ఏళ్లు వెనక్కి వెళ్ళిందని విమర్శలు చేయడం జరిగింది.రాష్ట్రంలో సకాలంలో ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితి నెలకొంది.

అయితే ఇదే విషయాన్ని కోర్టు చీఫ్ సెక్రటరీ జోహార్ రెడ్డిని ప్రశ్నిస్తే తన తండ్రి కూడా ఉపాధ్యాయుడైనని తన చిన్నతనంలో కూడా మూడు నెలలు జీతాలు రాలేదని చెప్పారని… ఆయన చిన్నతనం అంటే 50 ఏళ్ల కిందటే కదా అని… పేర్కొన్నారు.ప్రభుత్వం జీతాలు ఇచ్చుకోలేని దారుణ పరిస్థితిని కూడా మంత్రి బొత్స సత్యనారాయణ సమర్ధించుకోవడం సిగ్గుచేటని విమర్శించారు.

ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీ ప్రభంజనం కొనసాగుతుందని చంద్రబాబు రోడ్ షోకి జనాలు పోటెత్తుతున్నారని… రఘురామకృష్ణరాజు చెప్పుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube