ప్యారారం గ్రామాన్ని దత్తత తీసుకున్న ఉస్మానియ వైద్యులు

యాదాద్రి భువనగిరి జిల్లా:బొమ్మలరామారం మండలం ప్యారారం( Pyararam ) గ్రామాన్ని ఉస్మానియా మెడికల్ ఆసుపత్రి వైద్యులు దత్తత తీసుకున్నారు.శనివారం 84 మంది మెడికల్ కాలేజీ విద్యార్థులతో ఉస్మానియా హాస్పిటల్ డాక్టర్స్ గ్రామాన్ని సందర్శించి 3 ఇండ్లకు ఒకరు చొప్పున గ్రామంలో ఇంటింటి సర్వే నిర్వహించారు.

ఓపి విభాగంలో అందరినీ పరీక్షించి,మందులు పంపిణీ చేశారు.

ఈ విధంగా ప్రతి నెలలో 2వ, మరియు 4వ శనివారం 3 సంవత్సరాల పాటు దత్తత కింద పరీక్షలు చేస్తామని తెలిపారు.ప్యారారం గ్రామాన్ని ఉస్మానియా మెడికల్ స్టూడెంట్స్ దత్తత తీసుకున్నందుకు మాజీ ఎంపీపీ చిమ్ముల సుధీర్ రెడ్డి,మాజీ సర్పంచ్ రవీందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

Osmania Doctors Who Adopted Pyararam Village, Pyararam, Osmania Doctors ,adopt

ఈ కార్యక్రమంలో ఉస్మానియా హాస్పిటల్ ప్రొఫెసర్ నీలిమ,అసిస్టెంట్ ప్రొఫెసర్లు పావని,మనీజా, రితిక,శ్రీనివాస్,విద్యార్థులు పాల్గొన్నారు.

మార్కులు తక్కువచ్చాయని కనిపించకుండాపోయిన బాలుడు
Advertisement

Latest Yadadri Bhuvanagiri News