హిందీలో ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ కార్యక్రమం సూపర్ హిట్ అవ్వడంతో దాదాపు అన్ని ఇండియన్ భాషల్లో కూడా ఆ కార్యక్రమం ఆయా భాషల్లో ప్రముఖ హీరోలతో జరిగిన విషయం తెల్సిందే.తెలుగులో నాగార్జున హోస్ట్గా ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమం ఇప్పటికే రెండు సీజన్లను పూర్తి చేసుకుంది.
ప్రస్తుతం మూడవ సీజన్కు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి.ఇప్పటికే నాగార్జున మూడవ సీజన్ కోసం డేట్లు కూడా ఇచ్చినట్లుగా విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది.
ప్రస్తుతం నాగార్జున ‘సోగ్గాడే చిన్ని నాయనో’ చిత్రంతో పాటు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో కార్తితో కలిసి మల్టీస్టారర్ సినిమాను చేస్తున్నాడు.ఈ రెండు సినిమాలు పూర్తి కాగానే ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమం మూడవ సీజన్ను ప్రారంభించబోతున్నాడు.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం డిసెంబర్ లేదా జనవరిల్లో ఈ కార్యక్రమం ప్రారంభం అయ్యే ఛాన్స్ ఉంది.ఇప్పటికే రెండు సీజన్లు మంచి విజయాన్ని సొంతం చేసుకోగా, మూడవ పార్ట్ కూడా తప్పకుండా ఆకట్టుకుంటుందని తెలుగు ప్రేక్షకులు అంటున్నారు.
మాటీవీని స్టార్ టీవీ సొంతం చేసుకున్న తర్వాత రూపొందబోతున్నందున ఈసారి ప్రత్యేకంగా, మరింత హంగూ, ఆర్బాటాలతో ఉండే అవకాశాలున్నాయి.