యాగం హడావిడి లో ఉన్న కెసిఆర్ ఇప్పుడు తెలంగాణా లో పాలనా వ్యవస్థ మీద దృష్టి పెట్టారు.యాగం పూర్తి అవడం వెంటనే ఆయన తన పరిపాలనకి సంబంధిచిన పనుల్లో దిగిపోయారు.
కొన్ని కీలక నిర్ణయాలు వెను వెంటనే తీసుకున్నారు కెసిఆర్.మలక్ పేటకు దగ్గరలో చంచల్ గుడా జైలు ను , గుర్రపు పందేలకు అడ్డగా ఉన్న రేసు కోర్టు నీ నగర శివార్లలో కి మార్చాలి అని పెద్ద నిర్ణయమే తీసుకున్నారు ఆయన.
అక్కడ ఉన్న దాన్ని ఇక్కడికీ ఇక్కడ ఉన్న దాన్ని అక్కడకీ మార్చడం కెసిఆర్ కి కొత్తేమీ కాదు.ముఖ్యమంత్రి గా ఆయన బాధ్యతలు తీసుకున్న తరవాత నుంచీ ఇలాంటివి ఏవో ఒకటి చేస్తూనే ఉన్నారు.
కొన్ని సానుకూలం గా మారితో మరికొన్ని వివాదాలు గా మారాయి.ఇప్పుడు తాజా నిర్ణయం లో చంచల్ గూడ జైలును చర్లపల్లికి.
రేస్ కోర్సును నగరశివారుకు మార్చాలంటూ నిర్ణయంతీసుకున్నారు.అదే సమయంలో ఈ రెండుచోట్ల రెసిడెన్షియల్ పాఠశాలల్నిఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.