రైతాంగాన్ని కాపాడుకోవడమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే పద్మావతి

సూర్యాపేట జిల్లా( Suryapet District ):రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రుణమాఫీ పథకానికి సంబంధించిన వీడియో కాన్ఫిరెన్స్ ని సూర్యాపేట జిల్లా మోతె మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి( Kodada MLA Padmavathi Reddy ), సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ పాల్గొని జిల్లాల వారీగా రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రివర్గ సభ్యులు,వివిధ మండలాల రైతులతో మాట్లాడుతూ రైతుల ఆనందాన్ని తెలుసుకుంటున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ( Congress party ) ఇచ్చిన మాట తప్పదని,రైతాంగాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటామని తెలిపారు.బీఆర్ఎస్ వాళ్ళు రాజనామా పత్రాలను సిద్ధం చేసుకోవాలని కోరారు.

అనంతరం ఎమ్యల్యే, జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా మండలంలోని అన్ని గ్రామాల లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మీ చెక్కులు పంపిణీ చేశారు.

చుట్టపు చూపుగా వచ్చి అనంతలోకాలకు వెళ్ళిన తీరు...!
Advertisement

Latest Suryapet News