భారతీయ సంప్రదాయానికి ప్రతీక, ప్రజలందరూ జరుపుకునే పండగలలో ముఖ్యమైన పండుగ దీపావళి( Diwali ) అని ఖచ్చితంగా చెప్పవచ్చు.ఎందుకంటే ఈ పండుగ అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు అందరికీ చాలా ఇష్టం.
అంతేకాకుండా ఇల్లంతా దీపాలతో అలంకరిస్తూ కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉంటారు.కొత్త దుస్తులతో కుటుంబ సభ్యులంతా ఈ పండుగను ఎంతో ఆనందంగా జరుపుకుంటారు.
మన భారతదేశంలో దీపావళి పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.ఈ పండుగకు ఉపయోగించే ఇటీవల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా చెప్పాలంటే దీపావళి పండుగ ను మన రెండు తెలుగు రాష్ట్రాలలో కాక దక్షిణ భారతీయులు( South Indians ) కూడా దీనిని ముఖ్యమైన పండుగగా జరుపుకుంటారు.అంతే కాకుండా అక్కడ దీనిని ఐదు రోజుల పండుగగా జరుపుకుంటారు.దీపావళి రోజున లక్ష్మీదేవిని మన ఇంటికి ఆహ్వానిస్తారు.అంటే ఆ రోజు సంపదకు, ఆనందానికి, ఐశ్వర్యానికి సంకేతంగా దీపావళి పండుగను జరుపుకుంటారు.మనం దీపాన్ని ఆరాధించి పూజిస్తే లక్ష్మీదేవి ( Goddess Lakshmi )మన ఇంటికి వస్తుందని ఆ రోజు లక్ష్మీదేవిని ఆరాధించి పూజిస్తారు.ఇల్లంతా రంగురంగుల వల్లికలతో, దీపాలతో అలంకరిస్తారు.

లక్ష్మీదేవిని ఇలా పూజించడం వల్ల అప్పుల బాధలు తొలగిపోతాయి సిరి సంపదలు వస్తాయని పండితులు చెబుతున్నారు.దీపావళి పండుగ రోజున పెద్దలు పిల్లలతో దగ్గరుండి దివిటీలు కొట్టించడం మనం చూస్తూనే ఉంటాం.వాటిని ఎలా తయారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.గోగునారుతో నూనెలో నానబెట్టిన ఒత్తిని ఒక బట్టను కట్టి దానిని దీపంతో వెలిగిస్తారు.అలాగే కాసేపు నానబెట్టి పిల్లలకు ఆ కర్రలు కలకుండా చెరుకు కాడ ముక్కలను ఒత్తులుగా కట్టించి కొట్టిస్తారు.పిల్లలు వీటిని ఇంటి ముందు నిలబెట్టి వెలిగిస్తారు.
అంతే కాకుండా ఆకాశంలో గుండ్రంగా మూడుసార్లు వీటిని తిప్పుతారు.తిప్పు తిప్పు దీపావళి మళ్లీ వచ్చి నాగుల చవితి అని పిల్లలతో పాటలు పాడిస్తూ కోట్టిస్తారు.