శ్రీశైలం దేవాలయం పరిధిలోని మల్లన్న షాపుల వేలం పాట ఉత్కంఠ భరితంగా పొట పోటీగా జరిగింది.దీని వల్ల శ్రీశైలం దేవస్థానానికి బహిరంగ వేలం పాట ద్వారా కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది.
ఈ మధ్య ఎన్నడూ లేని విధంగా వేలం పాట పోట పాటిగా షాపులను వేలం పాటలో దక్కించుకోవడం విశేషం.దేవస్థానం పరిధిలోని 39 షాపులకు అధికారులు వేలంపాటను నిర్వహించగా ఏడాదికి కోటి నాలుగు లక్షల రూపాయల అంచనాలతో రేట్లు నిర్ణయించినట్లు సమాచారం.
కానీ ఎవరు ఊహించని విధంగా దేవస్థానానికి షాపులో వేలంలో ఊహించని మొత్తం లభించింది.
ఎంతో ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ వేలం పాట దేవా స్థానానికి ఊహించని విధంగా సంవత్సరానికి రెండు కోట్ల 38 లక్షల రూపాయల ఆదాయం వచ్చినట్లు పాలక మండలి చైర్మన్ రెడ్డి వారి చక్రపాణి రెడ్డి తెలిపారు.
లక్షల రూపాయలతో వేలం పాట పాడి కొన్ని షాపులను కొంత మంది దక్కించుకున్నారు.దేవస్థానానికి చెందిన 36 షాపులకు అధికారులు బహిరంగ వేలం పాట ను ఏర్పాటు చేశారు.
సుమారు 300 మంది వేలం పాటలో పాల్గొని షాపులను దక్కించుకున్నారని చైర్మన్ రెడ్డి వారి చక్రపాణి రెడ్డి గారు వెల్లడించారు.ఎటువంటి గొడవలు, తోపులాటలు జరగకుండా పోలీస్ వారు సిబ్బంది తో సహా భారీ బందోబస్తును ఏర్పాటు కూడా చేశారు.
దేవ స్థానం వారు నిర్వహించిన ఈ వేలం పాటలో ఎన్నడూ లేనివిధంగా వేలం పాట వల్ల దేవస్థానానికి కోట్లలో ఆదాయం వచ్చినట్లు పాలక మండలి చైర్మన్ రెడ్డి వారి చక్రపాణి రెడ్డి గారు చెప్పారు.