మహిళలకు రక్షణ కల్పించలేని సీఎం, డీజీపీ ఎందుకు? - వంగలపూడి అనిత

వైసీపీ పాలనలో మహిళల ప్రాణ, మాణాలకు రక్షణ లేకుండా పోయిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు వంగలపూడి అనిత ద్వజమెత్తారు.శనివారం నాడు ఆమె విలేకరులతో మాట్లాడుతూ… అనంతపురం జిల్లాలో జరిగిన బాలిక ఆత్మహత్యపై టీడీపీకి ఆపాదించి రాజకీయాలు మాట్లాడిన మహిళా కమిషన్ చైర్ పర్షన్ వాసిరెడ్డి పద్మ వీటికి ఏం సమాధానం చెబుతారు? గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో వివాహితపై 6 గురు గ్యాంగ్ రేప్ చేశారు.

 Tdp Polit Beureau Member Vangalapudi Anitha Fires On Ycp Government Over Women A-TeluguStop.com

దీనిపై బాధిత మహిళ ఫిర్యాదు చేసేందుకు వెళ్తే స్ధానిక సీఐ ఫిర్యాదు తీసుకోకపోగా ఆ మహిళను బూతులు తిట్టి మానసిక క్షోభకు గురి చేయటంతో ఆత్మహత్యకు పాల్పడింది.ఎమ్మెల్సీ అప్పిరెడ్డి నిందితుల్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఆత్మహత్యకు పాల్పడిన మహిళా మృతదేహానికి పోస్టుమార్టం జరుగుతుండగానే కాకినాడలో ప్రేమోన్మాది మరో యువతిని గొంతు కోసి చంపాడు.రాష్ర్రంలో మహిళలకు రక్షణ ఎక్కడుంది? మహిళలకు రక్షణ కల్పించలేని ముఖ్యమంత్రి, డీజీపీ, హోంమంత్రి, మహిళా కమిషన్ ఎందుకు? అని నిలదీశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube