అగస్త్యేశ్వరుడి కొండపై వెలసిన ప్రాచీన శిలాశాసనం..

మన భారతదేశంలో ఎన్నో వేల సంవత్సరాల నాటి ప్రాచీన పుణ్యక్షేత్రాలు ఎన్నో ఉన్నాయి.తాజాగా మరో ప్రాచీన శిలాశాసనం వెలుగులోకి వచ్చింది.

 Ancient Inscription On The Hill Of Agastheeswar , Agastheeswar , Punganur Manda-TeluguStop.com

పుంగనూరు మండలం నెక్కుంది సమీపంలో అగస్త్యేశ్వరస్వామి కొండ పై రెండు ముక్కలైన దశలో ఉన్న ఈ రాతి మీద అక్షరాలు క్రీస్తు శకం 1674వ సంవత్సరానికి చెందిన చరిత్రక ఆధారమని వెల్లడించింది.అగస్త్యేశ్వరాలయం కొండ శిఖరాగ్రాన ప్రదేశంలో అగస్త్య మహారుషి పూజించిన శివలింగాన్ని ప్రతిష్టించడంతో ఈ దేవాలయానికి పేరు వచ్చింది అని చెబుతారు.

ప్రతి సంవత్సరం ఇక్కడ మహా శివ రాత్రికి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతూ ఉంటాయి.దేవాలయం వద్ద 16 స్తంభాల పై నాలుగు అంతస్తుల గౌనోళ్ల మండలం 18 మెట్లపై అత్యంత సుందరంగా నిర్మించారు.

ఈ మండపానికి సంబంధించిన ఆధారం సమీపంలోని లభించింది.రాతి బండ పై తెలుగులో 11 వరుసలతో వివరాలు ఉన్నాయి.1674వ సంవత్సరంలో బయిరాకూరుకు చెందిన అమ్మాజమ్మ మనువడు లింగనగవుని-హలిదేవమ్మ దంపతుల కుమారుడు అయిన ములువగలు గవుడు తమ పెద్దల శివప్రీతి కోసం శివాలయంలో ఈ మండపాన్ని కట్టించినట్లుగా శాసనంలో ఉంది.

Telugu Agastheeswar, Andhra Pradesh, Bakti, Chittoor, Devotional, Maha Shivratri

పుంగనూరు శుభారాం ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో హిస్టరీ లెక్చరర్ గా పనిచేసే ఎన్.ఆంజనేయ రెడ్డి, శ్రీకాళహస్తి ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీ లెక్చరర్ కే.సావిత్రి ప్రార్థన పురాతన శిలాశాసన లను అన్వేషిస్తూ ఉండేవారు.ఇందులో భాగంగానే వీరు ఈ ప్రాచీన శిలా శాసనాన్ని గుర్తించారు.ఈ ఫోటోలను మైసూర్ లోని పురావస్తు శాఖ డైరెక్టర్ మునిరత్నం రెడ్డికి పంపారు.ఆయన అధ్యయనం చేసి దాని కాలాన్ని అందులోని వివరాలను ప్రజలకు వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube