‘బాహుబలి’ రెండవ పార్ట్ చిత్రీకరణ ప్రస్తుతం జరుగుతున్న విషయం తెల్సిందే.మొదటి పార్ట్ సంచలన విజయాన్ని సాధించి మరే సౌత్ సినిమా ఇప్పట్లో సాధించలేనంతగా భారీ కలెక్షన్స్ను వసూళ్లు చేసింది.
ఆ కలెక్షన్స్ను బీట్ చేయడమే లక్ష్యంగా కాస్త ఆలస్యం అయినా పర్వాలేదు అనే ఉద్దేశ్యంతో టాలీవుడ్ జక్కన్న రాజమౌళి పని చేస్తున్నాడు.మొదటి పార్ట్ కంటే ఈ రెండవ పార్ట్లో మరింతగా అదనపు హంగులను ఈ చిత్రానికి అద్దుతున్నాడు.
భారీ అంచనాలున్న ఈ రెండవ పార్ట్లో కామెడీ స్పెషల్ అట్రాక్షన్గా నిలువబోతున్నట్లుగా తెలుస్తోంది.
మొదటి పార్ట్ అంతటి బ్లాక్ బస్టర్ సక్సెస్ అయినప్పటికి కూడా కామెడీ లేదు అనే చిన్న విమర్శ వచ్చింది.
ఆ విమర్శలు ఈ రెండవ పార్ట్కు రావద్దనే ఉద్దేశ్యంతో రాజమౌళి కామెడీని పెట్టాలని నిర్ణయించుకున్నాడు.టాలీవుడ్లో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ కమెడియన్గా పేరు తెచ్చుకున్న పృథ్వీని ఈ చిత్రంలో ఒక చిన్న పాత్ర చేయించబోతున్నాడు.
కథకు సంబంధం లేకుండా అయిదు నుండి పది నిమిషాల నిడివితో కామెడీ ట్రాక్ను రాజమౌళి చిత్రీకరించబోతున్నారు.ఎడిటింగ్ సమయంలో సినిమా బోర్ ఫీలింగ్ అనిపించిన దగ్గర ఆ కామెడీ సీన్స్ను ఇరికించబోతున్నట్లుగా తెలుస్తోంది.
ఇక హిందీ మరియు హాలీవుడ్ వర్షన్కు ఈ కామెడీ సీన్స్ లేకుండానే విడుదల చేయబోతున్నారు.సౌత్లో మాత్రమే ఈ కామెడీతో ‘బాహుబలి’ రాబోతున్నాడు.
ఇదే సంవత్సరం చివర్లో ఈ బాహుబలి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.
.