తెలంగాణ బీజేపీ, జనసేన నేతలు ఢిల్లీకి పయనం అయ్యారు.ఈ మేరకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహార్ ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరారు.
తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేసే అంశంపై బీజేపీ అధిష్టానంతో చర్చించనున్నారు.కాగా రాష్ట్రంలో బీజేపీ – జనసేన పొత్తు పెట్టుకునేందుకు రెడీ అయిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో బీజేపీ అగ్రనేతలతో రాష్ట్ర పార్టీ నేతలు, జనసేనాని చర్చించనున్నారు.కాగా పొత్తుపై చర్చల తరువాత పోటీ చేసే సీట్లపై క్లారిటీ రానుంది.
తెలంగాణలో 35 స్థానాల్లో పోటీ చేస్తామని జనసేన ఇప్పటికే ప్రకటించగా బీజేపీ ఆరు నుంచి పది స్థానాలు మాత్రమే ఇవ్వాలనే యోచనలో ఉందన్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో చర్చల అనంతరం సీట్ల కేటాయింపు వ్యవహారం కొలిక్కి రానుందని తెలుస్తోంది.