వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తన పాదయాత్రపై తెలంగాణ హైకోర్టుకు వెళ్లారు.పాదయాత్రకు వరంగల్ పోలీసులు అనుమతి ఇవ్వడం లేదని పిటిషన్ దాఖలు చేశారు.
ఈ క్రమంలో తన పాదయాత్రకు అనుమతి ఇచ్చేలా వరంగల్ సీపీకి ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ లో పేర్కొన్నారు.దాంతో పాటు వరంగల్ సభకు అనుమతిపై న్యాయస్థానంలో షర్మిల లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్ ను మరికాసేపటిలో హైకోర్టు విచారించనుంది.