మరో ఐదు రోజుల్లో దీపావళి పండుగ రాబోతుంది.మరి సాధారణ ప్రజలు ఎప్పుడెప్పుడు పండగ చేసుకుందామా అని ఎదురు చూస్తున్నారు.
కానీ దీపావళి 2022 లో మాత్రం మితిమీరిన క్రాకర్స్ వెలిగించి శబ్ద కాలుష్యం రాకుండా పెంపుడు జంతుకలకు అనుకూలంగా ఉండే దివాళీ ని జరుపు కోవాలని సెలెబ్రిటీలు కోరుతున్నారు.ఈ నేపథ్యంలోనే క్రాకర్స్ పేల్చకండి అంటూ బాలీవుడ్ సెలెబ్రిటీలు అభిమానులను కోరుతున్నారు.
అలియా భట్ : 2017లో #PoochOverPataka అనే క్యాంపెయిన్ ను స్టార్ట్ చేసి మూగ జీవాలను కాపాడాలని జంతుజాలం బయపడుతున్నందు వల్ల క్రాకర్స్ పేల్చకూడదు అని తెలిపింది.ఈ ఏడాది కూడా ఇదే విషయం ఫ్యాన్స్ కు విఘ్నప్తి చేసింది.
ప్రియాంక చోప్రా : ఈమె ఇండియాలోనే కాకుండా హాలీవుడ్ లో కూడా ఫేమస్ అయినా హీరోయిన్.మరి ఈమె కూడా పర్యావరణంపై ప్రభావం చూపుతుంది అని మూగ జీవాలను కాపాడాలని.
క్రాకర్స్ కాల్చకండి అంటూ ఆమె ఫ్యాన్స్ ను కోరుతూ ప్రచారం చేస్తుంది.
అనుష్క శర్మ : ఈ బాలీవుడ్ బ్యూటీ కూడా పోజిటివిటీ పేరుతో క్రాకర్స్ కాల్చకండి అంటూ జంతువులను దృష్టిలో పెట్టుకుని క్రాకర్స్ ను నిషేధించండి అంటూ ప్రచారం చేస్తుంది.శబ్దం లేని దీపావళిని జరుపు కోవాలని కోరుతు ఫ్యాన్స్ కు రిక్వెస్ట్ చేస్తుంది.
దిశా పటానీ : ఈమె పెంపుడు జంతువులకు అనుకూలమైన దీపావళి ని జరుపు కోవాలని.శబ్దం కారణంగా జంతువులు బయపడతాయని.వాటిని దృష్టిలో పెట్టుకుని దీపావళి పండుగ జరుపు కోవాలని.
ఫ్యాన్స్ ను కోరుతుంది.
ఇంకా వీరితో పాటు బాలీవుడ్ ముద్దుగుమ్మలు అనన్య పాండే, నేహా ధూపియా వంటి వారు కూడా శబ్దం లేని దీపావళి జరుపు కోవాలని తెలిపారు.
అలాగే టాలీవుడ్ కథానాయికలతో పాటు ప్రముఖులు సైతం శబ్దం లేని దీపావళి జరుపు కోవాలని క్రాకర్స్ ను నిషేధించండి అంటూ ఫ్యాన్స్ ను కోరుతున్నారు.