క్రుష్ణానదిలో శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల నదీ విహారానికి బ్రేక్

ఇంద్రకీలాద్రి: క్రుష్ణానదిలో శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల నదీ విహారానికి బ్రేక్.

నది ఒడ్డున హంస వాహనం ఉంచి శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్లకు పూజాది కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయం.

పులిచింతల నుంచి లక్ష క్యూసెక్కుల వరద నీరు రావడంతోనే నదీ విహారం కు సాధ్యపడదని జల వనరుల శాఖ కలెక్టర్ కు రిపోర్ట్.కలెక్టర్ దిల్లీరావు, ఇరిగేషన్ అధికారి క్రుష్ణమూర్తి.

క్రుష్ణానది లో వరద ప్రవాహం కొనసాగుతుండడంతో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల నదీ విహారం నిర్వహించడం సాధ్యం కాదు.పులిచింతల నుంచి లక్ష క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతుంది.

మూడు రోజుల పాటు క్రుష్ణానదిలో ప్రవాహం కొనసాగుతున్నందున స్వామి వార్ల నదీ విహారం చేపట్టలేకున్నాం.కేవలం దుర్గాఘాట్ లో హంస వాహనంపై స్వామి వార్ల ఉత్సవ మూర్తులను ఉంచి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తాం.

Advertisement

స్వామి వార్ల పూజాది కార్యక్రమాలు తిలకించేందుకు భక్తులకు ప్రకాశం బ్యారేజి, పున్నమిఘాట్, ఫ్లై ఓవర్, దుర్గాఘాట్ లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం.వేలాది మంది తెప్పోత్సవాన్ని తిలకించేందుకు వస్తారు కాబట్టి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం.

These Face Packs Help To Get Smooth Skin Details Face Packs
Advertisement

తాజా వార్తలు