1.తెలంగాణలో మరోసారి జ్వర సర్వే
తెలంగాణలో కోవేట్ వ్యాప్తి తీరు కట్టడి చర్యలకు ప్రభుత్వం అప్రమత్తమైంది.అన్ని జిల్లాల కలెక్టర్లు మంత్రి హరీష్ రావు కేటీఆర్ ఎర్రబెల్లి దయాకర్ రావు భేటీ కానున్నారు.తెలంగాణ పెరుగుతున్న మరోసారి దొర సర్వే నిర్వహించాలని నిర్ణయించుకున్నారు.
2.కిషన్ రెడ్డికి కరోనా పాజిటివ్
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
3.గ్రూప్ నోటిఫికేషన్ విడుదల చేయాలి : బండి సంజయ్
గ్రూప్ సర్వీస్ ఉద్యోగాలు నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు.
4.ఎమ్మెల్సీగా తాత మధు ప్రమాణ స్వీకారం
శాసనమండలిలో ఎమ్మెల్సీగా తాత మధురమైన స్వీకరం చేశారు.
5.మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలి
మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలని మాజీ డిప్యూటీ సీఎం ఎమ్మెల్సీ కడియం శ్రీహరి డిమాండ్ చేశారు.
6.ముంబై డ్రగ్స్ మాఫియా నిందితుడు టోని అరెస్ట్
ముంబై డ్రగ్స్ మాఫియా ప్రధాన నిందితుడు టోనీ ని ముంబై లో పోలీసులు అరెస్ట్ చేశారు.
7.తిరుమల సమాచారం
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.బుధవారం తిరుమల శ్రీవారిని 34,187 మంది భక్తులు దర్శించుకున్నారు.
8.కరోనా బాధితుల సేవ లోకి ఎన్టీఆర్ ట్రస్ట్
కరోనా మూడో దశ విజృంభిస్తున్న సూచనలు కనిపిస్తుండటంతో ఎన్టీఆర్ ట్రస్ట్ మరోసారి బాధితుల సేవ కోసం రంగంలోకి దిగింది.
9.జనవరి 30 తర్వాత బడులు తెరవండి : టస్మా
జనవరి 30 తర్వాత రాష్ట్రంలో బడులు తెరవాలని తెలంగాణ రికగ్నైస్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ( ట్రస్మా ) నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
10.22 నుంచి సిపిఎం రాష్ట్ర మహాసభలు
రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ లో 22 నుంచి 25 వరకు సిపిఎం రాష్ట్ర మహాసభలు జరగనున్నాయి.
11.సినీనటుడు దాసరి అరుణ్ పై కేసు
బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సయ్యద్ నగర్ లో సినీ నటుడు దాసరి అరుణ్ కుమార్ డ్రైవింగ్ చేస్తూ ఈ రోజు తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొట్టారు ఈ ఘటన ఆయనపై కేసు నమోదైంది.
12.భారతీయ యువకుడు అపహరించిన చైనా ఆర్మీ
చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ pla అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ యువకుడు ని భారత భూభాగం నుంచి అపహరించింది.
13.సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు
ముస్లింల చేత వందేమాతరం ఆడించేందుకు ప్రయత్నిస్తున్నామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యానించారు.
14.జగన్ పై సినీ నటుడి ప్రశంసలు
గత ఏడాది నవంబర్ లో అనారోగ్యం పాలై ఆసుపత్రి లో చేరిన సినీ నటుడు కైకాల సత్యనారాయణ కోలుకున్నారు.తాను ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న సమయంలో తమ కుటుంబానికి భరోసా అందించినందుకు కృతజ్ఞతలు అంటూ ఆయన లేఖలో పేర్కొన్నారు.
15.ఏపీలో కమాండ్ కంట్రోల్ సెంటర్ పునరుద్దరణ
ఏపీలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ను పునరుద్ధరించనున్నారు.కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
16.భారత్ లో కరోనా
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 3,17,532 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
17.ఆన్లైన్ సమీక్ష నిర్వహించనున్న చంద్రబాబు
కరోనా తో హోం ఐసొలేషన్ లో ఉంటూ నియోజకవర్గాల వారీగా ఆన్లైన్ సమీక్ష టీడీపీ అధినేత చంద్రబాబు చేయనున్నారు.
18.పి ఆర్ సి జీవో పై కోర్టులో పిటిషన్
ఏపీ ఉద్యోగులకు పిఆర్సి పై ప్రభుత్వం జారీ చేసిన జీవో పై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
19.గృహ హింస కేసులో ‘ కన్నా ‘ కోడలికి కోటి పరిహారం
గృహ హింస కేసులో మాజీ మంత్రి బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ కోడలు శ్రీ లక్ష్మి కీర్తికి కోటి పరిహారం చెల్లించాలని విజయవాడ ఒకటో చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు తీర్పు ఇచ్చింది.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 47,590
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 49,590
.